
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..
మల్లాపూర్ ఆగస్టు 25 ( ప్రజా కలం ప్రతినిధి)
సకాలంలో యూరియా అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకాలంలో యూరియా అందక పంటలకు ఎదుగుదల లేక నష్టం వాటిల్లుతుంది అని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.రైతులకు యూరియా ను అందించి రైతు కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
TAGS Hot News

