తిరుమలలో మెట్ పల్లి వాసి హఠాన్మరణం..

తిరుమలలో మెట్ పల్లి వాసి హఠాన్మరణం..

గుండెపోటుతో బిజెపి నాయకులు మృతి
వేంపేట్ లో విషాదం
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 09(ప్రజా కలం)
మెట్ పల్లి మండలం వేంపేట గ్రామ మాజీ సర్పంచ్, న్యాయవాది బిజెపి సీనియర్ నాయకులు మారంపల్లి శ్రీనివాస్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మారంపల్లి శ్రీనివాస్ (52)తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దైవదర్శనానికి వెళ్ళారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల మెట్ పల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సంతాపం వెలుబుచ్చారు.
ఆయనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
బిజెపి రాష్ట్ర నాయకులు, స్థానిక వైద్యులు డాక్టర్ చిట్నేని రఘు తో పాటు పలువురు నాయకులు ఆయన ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )