10 వేల కింటాళ్ళ సర్కార్ ధాన్యం గయబ్…!?

10 వేల కింటాళ్ళ సర్కార్ ధాన్యం గయబ్…!?

– సివిల్ సప్లై డీఎం కనుసైగలోనే బ్లాక్ మార్కెట్ కు
మెదక్ (ప్రజాకలం ప్రతినిధి) మెదక్ జిల్లా రేగోడ్ మండలం శ్రీ గురుకృపా రైస్ మిల్లు ధాన్యం పెద్దశంకరంపేట శివాయిపల్లి శ్రీ మల్లిఖార్జున బిన్నీ మాడ్రన్ రైస్ లో గోదాం పేరుతో అక్రమంగా 27 వేల ధాన్యంను సేకరించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం నిల్వలు పూర్తిగా రేగోడ్ మండల కేంద్రంలోని శ్రీ గురుకృపా రైస్ మిల్లులోనే నిల్వ ఉండాలి,కానీ మెదక్ డీఎం మామూళ్లు దండుకొని దొడ్డి దారిలో ఆదేశాలిచ్చారు.శివాయపల్లిలో గోదాం పేరుతో శ్రీ మల్లిఖార్జున బిన్నీ మాడ్రన్ రైస్ మిల్లు యజమాని చేతికి అప్పగించారు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం బ్లాక్ మార్కెట్ తరలించి లక్షలు జేబులు నింపుకున్నారు. ప్రస్తుతం గోదాం మరియు పాపన్నపేట గోదాములో 27 వేల కింటాళ్ళ ధాన్యం ఉండాల్సి ఉంది.కానీ రెండు ప్రదేశాల్లో కలిపి 10 వేల కింటాళ్ళ ధాన్యం బ్లాక్ మార్కెట్ లోకి పోయాయి.చర్యలు తీసుకోవాల్సిన డీఎం డబ్బులకు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది..?. జిల్లా కలెక్టర్ విచారణ చేసి మిల్లర్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రెండు రైస్ మిల్లులలో జరుగుతున్న బాగోతం మీ ప్రజాకలం దినపత్రికలో పార్ట్ 2 కోసం వేచి చూడాల్సిందే.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )