
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలి.
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలి.
జగిత్యాల జిల్లా ఆదనపు కలెక్టర్ బి ఎస్ లత
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 06 (ప్రజా కలం)తహసిల్దార్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేశారు. మెట్ పల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ బిఎస్ లతా నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును శూన్యంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్టిఫికెట్ల ప్రజలకు అందించవలసిందిగా అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, మెట్ పల్లి తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
TAGS Hot News

