
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం*
*రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వలిగొండ జూన్ 18 ప్రజాకలం*:వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని,వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ బీమా నాయక్,మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి అన్నారు.మంగళవారం వ్యవసాయ మార్కెట్లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేశారన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు మామిడి నరేందర్ రెడ్డి, వలిగొండ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య,వెల్వేర్తి గ్రామ శాఖ అధ్యక్షులు ఉక్కుర్తి స్వామి,తుర్కపల్లి మాజీ ఉపసర్పంచ్ బట్టు స్వామి, బట్టు నరసింహ,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాసుల వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.