వల్లభి కుర్రోడు తీసిన సినిమాకు గద్దర్ ఫిలిం అవార్డు

వల్లభి కుర్రోడు తీసిన సినిమాకు గద్దర్ ఫిలిం అవార్డు

-మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు గద్దర్ సినీ పురస్కారం .
2. సినీ దర్శకుడు ఎస్వి రమణ ప్రతిభకు తొలిసారి దక్కిన అరుదైన గౌరవం.
ఖమ్మం (ప్రజాకలం ప్రతినిధి)
జిల్లాలోని ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన యువ సినీ దర్శకుడు సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో తీసిన మెర్సీ కిల్లింగ్ సినిమాలో బాలనటికి ప్రతిష్టాత్మక గద్దర్ ఫిలిం అవార్డు లభించింది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా గత 14 ఏళ్ల తర్వాత సినీ అవార్డులను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించగా ఈ అవార్డ్స్ లో ఎస్ వి రమణ దర్శకత్వం వహించిన మెర్సీ కిల్లింగ్ సినిమాకు బాల నటి విభాగంలో బేబీ హారిక కు ఫిలిం అవార్డు అందుకున్నారు. సినీ దర్శకుడు ఎస్వి రమణ దర్శకత్వ ప్రతిభకు ప్రతిష్టాత్మక సినీ పురస్కారం లభించింది. సూరపల్లి వెంకటరమణ వల్లభి గ్రామంలో జన్మించి పదవ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని వల్లభి గ్రామం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్తిచేసి ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన అనంతరం తనకు ఉన్న అభిరుచి మేరకు హైదరాబాదులో ఫిలింనగర్లో పలు సినిమాలకు వివిధ విభాగాలలో పనిచేసి ఇప్పటివరకు మూడు సినిమాలకు దర్శకత్వ బాధ్యత వహించి మూడు సినిమాలను సూపర్ హిట్ చేశారు. మూడవ సినిమా మెర్సీ కిల్లింగ్ కు ప్రతిష్టాత్మక గద్దర్ పురస్కారం లభించింది. అంచలంచెలుగా ఎదిగి ఎస్వీ రమణ నేటి యువతరానికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ లో నటించిన బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా గద్దర్ అవార్డ్స్ ను అందుకున్నారు. ఎస్వి రమణ దర్శకత్వంలో

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా మెర్సీ కిల్లింగ్ సినిమాలో సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబి హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాకు వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది.

ఎమోషనల్ కథ ,కథనాలను సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని చేసిన మెర్సి కిల్లింగ్ సినిమా ప్రస్తుతం అహలో స్ట్రీమింగ్ అవుతోంది. వల్లభి గ్రామానికి చెందిన యువ సీనీ దర్శకుడు ఎస్వి రమణ దర్శకత్వంలో వచ్చిన మెర్సీ కిల్లింగ్ సినిమాకు గద్దర్ ఫిలిం అవార్డు లభించడం పట్ల గ్రామానికి చెందిన ఎస్వి రమణ బంధుమిత్రులు, ప్రముఖ న్యాయవాది బిచ్చాల బిక్షం , పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు వంగూరి పాపారావు, ఎస్ఐ చేకూరి లక్ష్మీనారాయణ, గురుకుల ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )