వినాయక నిమజ్జనం శనివారం రోజున జరుపుకోవాలి

మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 03 (ప్రజా కలం) వినాయక నిమజ్జనం శనివారం రోజున జరుపుకోవాలని మెట్టుపల్లి ఆర్డీవో నక్క శ్రీనివాస్ అన్నారు. బుధవారం రోజున
గణపతి నిమజ్జనం నకు సంబంధించి మెట్ పల్లి ఆర్డీవో ఎన్. శ్రీనివాస్ డిఎస్పీ శ్రీరాములు , మెట్ పల్లి తహసీల్దార్ శ్రీమతి నీత మరియు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ సంయుక్తంగా గణేష్ నిమజ్జనం చేయుట కొరకు సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకొని తేదీ: 06-09-2025 శనివారం రోజున గణేష్ నిమజ్జనం మెట్ పల్లి పట్టణంలో జరుపుకోవాలని నిర్ణయించడం జరిగినది.
కావున మెట్ పల్లి పట్టణంలో ఉన్న గణేష్ మండపాల నిర్వహకులు ఇట్టి విషయాన్ని గమనించగలరని కోరడమైనదనీ వారు అన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )