విద్యుత్ ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట

విద్యుత్ ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట

విద్యుత్ ఉద్యోగుల ఆరోగ్యానికి పెద్దపీట
*ఎన్‌పిడిసిఎల్‌లో మెడికవర్ ఉచిత మెగా వైద్య శిబిరం
పెద్దపల్లి,జూన్ 03:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లిలోని నార్త‌ర్న్ ప‌వ‌ర్ డిస్టిబ్యూష‌న్ కంప‌నీ లిమిటెడ్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎన్‌పిడిసిఎల్ ఎస్ఈ మాధ‌వ‌రావు ప్రారంభించారు.ఈ వైద్య శిబిరంలో సుమారు 120 మంది ఎన్‌పిడిసిఎల్ ఉద్యోగులు,సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికవర్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్ట‌ర్ అనీష్‌ప‌బ్బ,జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లోకేష్‌ వారికి పరీక్షలు చేసి,గుండె వ్యాధులు,సాధారణ అనారోగ్యాల పట్ల అవగాహన కల్పించారు.అవసరమైన వారికి షుగర్,బీపీ,ఈసీజీ,2డి ఎకో వంటి పరీక్షలు అక్కడికక్కడే నిర్వహించి,రోగ నిర్ధారణ చేశారు.ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ఎన్‌పిడిసిఎల్‌ ఉద్యోగులు,సిబ్బందికి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించిన‌ట్లు తెలిపారు.మెడికవర్ ఆసుపత్రిలో 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌పిడిసిఎల్ డీఈలు ర‌వి,తిరుప‌తి, పలువురు ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు.మెడికవర్ ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్లు కోట కరుణాకర్,బొంగోని హరీష్,శ్రీ‌న‌వాస్‌ తదితరులు శిబిరం నిర్వహణలో పాలుపంచుకున్నారు.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )