దేవాదాయ భూములు కబ్జా చేస్తే పీడి యాక్ట్ పెడతాం

దేవాదాయ భూములు కబ్జా చేస్తే పీడి యాక్ట్ పెడతాం

-రాష్ట్ర మంత్రి కొండ సురేఖ
బోడుప్పల్ లో కబ్జాకు గురైన దేవాదాయ భూముల పరిశీలన
మేడిపల్లి జూన్ 12(ప్రజాకలం న్యూస్)
రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను కబ్జాకు గురి కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు.గురువారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దేవాదాయశాఖ భూమి అన్యక్రాంతం అవుతుందన్న ఫిర్యాదు మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ జిల్లా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 33/8 లో 10.35 ఎకరాలు,
33/9 లో 13 ఎకరాలు,33/10 లో 6.23 ఎకరాల చొప్పున మొత్తం 30.28 ఎకరాల భూమిని 1968 లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్ కు భూ పట్టదారులైన తోటకూర ఎల్లయ్య యాదవ్ ఇతరులు రామయ్య చౌదరి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976 సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించారని తెలిపారు.దేవాదాయ శాఖ భూములు కబ్జాకు పాల్పడింది ఎవరైన సరే వదిలే ప్రసక్తే లేదని కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకొని కబ్జా దారులపై పీడీ యాక్ట్ పేడుతామని హెచ్చరించారు.
మంత్రి వెంట పర్యటించిన వారిలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్,కీసర అర్డీవో ఉపేందర్ రెడ్డి,మేడిపల్లి తహసీల్దారు హసీనా,
పీర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి,దేవాదాయ శాఖ సర్వేయర్లు,
అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )