
భవిష్యత్ భద్రత కొరకే ఇన్సూరెన్సులు
భవిష్యత్ భద్రత కొరకే ఇన్సూరెన్సులు
– ఇ – శ్రమ్ కార్డు ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగం
– ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్
మెట్ పల్లి(ప్రజాకలం ప్రతినిధి) భవిష్యత్ భద్రత కొరకే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులందరికీ ఇన్సూరెన్సులు చేయించినట్లు టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా మెట్ పల్లి అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ ఇ-శ్రమ్ కార్డ్ చాలా ఉపయోగం,దేశంలో అధిక శాతం మంది భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు. వీరికి పి ఎఫ్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు. ఏళ్ల తరబడి అదే పనిచేస్తున్నా గ్రాడ్యుటీ అంటేనే తెలియదు. ఇటువంటి శ్రమ జీవుల భవిష్యత్ భద్రత కోసం, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధికగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే ఈ ఇ-శ్రమ్ కార్డ్ అని అన్నారు
దీని ద్వారా కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి లోనై పాక్షిక వికలాంగులుగా మారితే లక్ష, మరణం సంభవిస్తే 2 లక్షల వరకు బీమా లభిస్తుంది అని అన్నారు.కేవలం ఇన్యూరెన్స్ మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పనిముట్లు, కుట్టు మిషన్లు వంటి ఇతర ఆర్థిక సహాయాలు ఈ పథకం కింద
అందుకోవచ్చు అని,
కార్మిక శాఖ నిర్వహిస్తున్న ఈ పథకంలో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయస్సున్న వ్యక్తులు అర్హులు కాబట్టి టీయూడబ్ల్యూజేఐజేయు ప్రింట్ మీడియా సభ్యులందరికీ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలోఅధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ , బాసెట్టి హరీష్ ,విజయసాగర్, సభ్యులు బొల్లం రాజు,ఆదిల్ పాషా, ఏసవిని గణేష్ ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.