బడిబాట’కు వేళాయె…

బడిబాట’కు వేళాయె…

బడిబాట’కు వేళాయె…
* ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన
* ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా చర్యలు
వలిగొండ జూన్ 9 ప్రజాకలం:ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాఠ శాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని,గణాంకాలతో సహా వివరించారు.అంతేకాక ఈ సారి ప్రవేశాలు పెరిగేలా కృషి చేయాలని సూచించ డంతో అధికారులు ఈనెల 6వ తేదీ నుంచి ‘బడిబాట’ నిర్వహణకు సిద్ధమయ్యారు.దీంతో పలు పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు వేసవి సెలవులు మొదలైనప్పటి నుంచే ప్రచారంలో నిమగ్నమ య్యారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య,పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ,ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వస్తున్న ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈసారి పకడ్బందీగా..
గతంలో ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పది రోజుల పాటు బడిబాట నిర్వహించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అయితే,ఇంత తక్కువ సంఖ్యలో ప్రవేశాలు జరగడంపై సమీక్షించిన విద్యాశాఖ అధికారులు ఈసారి మరింత పకడ్బందీగా బడిబాట నిర్వహించేలా సన్నద్ధమయ్యారు.కొన్ని పాఠ శాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, డిజిటల్ బోధన,ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తుండడం.. ఈసారి బడిబాట ముందుగా నిర్వహిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత విద్యా బోధన జరుగుతుందని,పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని ఉపాధ్యాయులు సోమవారం రెడ్లరేపాక గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. అనంతరం బడిబాట ప్రతిజ్ఞ చేశారు.
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం…
అమృతం రెడ్డి,హెచ్ఎం రెడ్లరేపాక

ప్రభుత్వం,ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 6నుం చి బడిబాట నిర్వహించేలా సన్నద్ధమవుతున్నాం.ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ఇతర సౌకర్యాలు,పదో తరగతి ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.గతంలో కంటే ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరగడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం…

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )