ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

ఖమ్మం, జూన్ 11( ప్రజా కలం న్యూస్ )
(ఖమ్మం జిల్లా ప్రతినిధి రాయబారపు రమేష్)
ఖమ్మం నగరంలోని బుధవారం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈ.వి.ఎం. గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ఈవిఎం గోడౌన్ సీల్ ను పరిశీలించి రాజకీయ ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీల్ తీసి లోపలికి వెళ్లి, ఈ.వి.ఎం., వి.వి.ప్యాట్లు ఉన్న గది లోపల పరిశీలన చేసి తిరిగి సీల్ వేయించారు. తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేసి, మాట్లాడుతూ, సీసీ కెమెరాల పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సిహెచ్. స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పి. శ్రీనివాస్, బిజేపి పార్టీ ప్రతినిధి టి. రవీందర్, సి.పి.ఐ.(ఎం.) పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, బి.ఆర్.ఎస్. పార్టీ ప్రతినిధి సతీష్ బాబు, టి.డి.పి. పార్టీ ప్రతినిధి పి. కృష్ణప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ. గోపాల్ రావు, అధికారులు, తదితరులు ఉన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )