దశాబ్దాల కృషికి ‘పద్మశ్రీ’ గౌరవం*

దశాబ్దాల కృషికి ‘పద్మశ్రీ’ గౌరవం*

దశాబ్దాల కృషికి ‘పద్మశ్రీ’ గౌరవం
*మంద కృష్ణ మాదిగకు పెర్క శ్యామ్ సన్మానం
పెద్దపల్లి,జూన్ 18:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి) భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రముఖ సంఘ సంస్కర్త,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు పెర్క శ్యామ్ మంగళవారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా పెర్క శ్యామ్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ నిస్వార్థ సేవకు,నిరంతర పోరాటానికి ప్రతీకఅని,సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన అంకితభావం,దృఢ సంకల్పం అందరికీ ఆదర్శప్రాయమని, పద్మశ్రీ పురస్కారం ఆయన చేసిన కృషికి,త్యాగాలకు తగిన గుర్తింపు అని కొనియాడారు.భవిష్యత్తులో కూడా ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం తాము కృషి చేస్తామని పెర్క శ్యామ్ పునరుద్ఘాటించారు.ఈ అవార్డు కేవలం మంద కృష్ణ మాదిగ కు మాత్రమే కాదని,దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన లక్షలాది మంది మాదిగ ప్రజలకు దక్కిన గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )