
మిషన్ భగీరథ మెయిన్ పైప్ లీకేజ్.
వెంకట్రావుపేట వద్ద పైపులు పగిలి రోడ్డు పైకి నీరు
వాహనాల రాకపోకలకు అంతరాయం
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 10 (ప్రజా కలం)
మెట్ పల్లి పట్టణం వెంకట్రావు పేట వద్ద గురువారం మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలింది.జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న లైన్ వద్ద లీకేజీ కావడంతో నిజామాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పెద్ద మొత్తంలో నీరు వృధాగా పోతుందని మిషన్ భగీరథ అధికారులు తక్షణమే స్పందించి పైప్ లైన్ కు మరమత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

TAGS Hot News

