
మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి
మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి అంటూ క్రై (CRY) సంస్థ పిలుపు
– *ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటాలి : బీపీ నాయక్*
బోనకల్ జూన్ 04(ప్రజాకలం ప్రతినిధి): *పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనుషులకు ఈ భూమ్మీద మనుగడ అని బీపీ నాయక్ అన్నారు*. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రముఖ ఎన్జీవో *క్రై (చైల్డ్ రైట్స్ అండ్ యు) సంస్థ* ఆధ్వర్యంలో పర్యావరణ సంరక్షణ మరియు పచ్చదనం గురించి ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు, *నాయక్ భరోసా* వ్యవస్థాపకులు *బీపీ నాయక్* పాల్గొన్నారు. అనంతరం పచ్చదనం పెంచడం కొరకు మరింత చొరవ తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి కోలా రాజేశ్వరి కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీపీ నాయక్ మాట్లాడుతూ బాలబాలికల చేత మొక్కలు నాటడం కార్యక్రమం మరియు చెట్ల పెంపకం విత్తనాభివృద్ధి వంటి అంశాలను విద్యార్థులకు నేరుగా బోధించడం ద్వారా క్రై సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. మన భూమిని పచ్చగా, స్వచ్ఛంగా ఉంచేందుకు కృషి చేద్దాం. చెట్లు నాటడం, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, శుభ్రమైన శక్తిని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుదాం. ప్రకృతిని సంరక్షించడం మనందరి బాధ్యత! రేపటి తరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన భూమిని అందిద్దాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రై సంస్థ రాణి నిర్వాహకులు బాల బాలికలు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.