
నల్గొండ జిల్లా క్రీడా శాఖలో అవినీతి కంపు….?
2కోట్లకు పైగా నల్గొండ క్రీడల శాఖలో అవినీతి కంపు…..?
– ప్రధాన సూత్రధారు లు తాత్కాలిక క్రీడల అధికారి, తాత్కాలిక ఉద్యోగి ఇద్దరు కుమ్మక్కు…..?
– స్విమ్మింగ్ పూల్ రాబడి అమౌంట్ గోల్ మాల్ …..?
– క్రీడా కిట్ లను తన అనునయులకు ఇచ్చేందుకు ప్రయత్నాలు…..?
-ఇండోర్ స్టేడియం అధీనం లో ఉన్న దుకాణ సముదాయంలో అద్దె వసూలులో చేతివాటం ….?
నల్లగొండ జూన్03 (ప్రజాకలం ప్రతినిధి)
నల్లగొండ జిల్లా క్రీడా శాఖలో అవినీతి మయం కొట్టినట్టు కనబడుతుంది అని ప్రజలు, పలువురు క్రీడా అభిమానులు ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఈ అవినీతి విషయాలు క్రింది నుంచి పై వరకు ప్రతి అధికారికి తెలిసిన వారి వారి జేబులు నిండితే చాలు అన్న విధంగా ఎవరికి ఏమైనా నాకు సంబంధం లేదు అంటూ నిద్రలో జోగుతున్న అధికారులు……. క్రీడా శాఖలో అవినీతి ఏ విధంగా ఉంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు…
స్విమ్మింగ్ పూల్ పేరుతో లక్షల్లో స్వాహా చేస్తున్నారు.విద్యార్థికి 1500/ – చొప్పున వసూలు…మే నెలలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు 100మంది, 7 గంటల నుండి 8 గంటల వరకు100 మంది, 8 గంటల నుండి 9 గంటల వరకు100 మంది 3బ్యాచ్లుగా ….బ్యాచ్కు 100మంది అంటే ఉదయం పూట 300 మంది, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు మొత్తం 300 మంది, రెండు పూటలా కలిపి 600 మంది.1500రూ./600 మంది. మొత్తం 2 నెలలుగా స్విమ్మింగ్ పూల్ నుండి వచ్చిన రాబడి 10లక్షలు రూపాయలు పైబడి ఉండగా ప్రభుత్వానికి ఎంత లెక్క ముట్ట చెబుతున్నారో ఎవరికీ తెలియదు… అసలు ప్రభుత్వం వరకు డబ్బులు వెళుతున్నాయా లేదా కూడా తెలియదు అని పట్టించుకునే నాధుడు లేడు….. ఎందుకంటే వారికి వారి జేబులు నిండితే చాలు అన్న విధంగా ఉన్నది పరిస్థితి….? ఇక్కడ ఇంకో విషయం చాలా తెలివిగా జరుగుతుంది… పనిచేసే ఇద్దరు కూడా తాత్కాలిగా ఉద్యోగులే కావడం తాత్కాలిక ఉద్యోగులు అయితే అందరి పని హాయిగా జరుగుతుంది….. ఎవరు ఇచ్చిన ఈజీగా తొలగించవచ్చు అన్న అభిప్రాయంతో చాలా తెలివిగా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకున్నారు . తాత్కాలిక అధికారిని తొలగించి శాశ్వత అధికారిని నియమించాలని క్రీడాకారులు ప్రజలు పెద్ద ఎత్తున కోరుతున్న పట్టించుకోని అధికారులు నాయకులు లేరు…. ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సి ఉంది ఖేలో ఇండియా నిధులు కూడా పక్క దారి పడుతూ క్రీడాకారులకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతున్న ఒక్క నాయకుడు పట్టించుకున్న పాపాన పోవడం లేదు… రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్న ఏం లాభం ఇటువంటివి అధికారులు ఉన్నంతకాలం క్రీడాకారులు వాళ్ళ ప్రతిభను తొక్కేసిన విధంగా జరుగుతుంది….? అవినీతి అధికారికి క్రీడల నిర్వహణపై గ్రిప్ లేదు, కార్యాలయ సిబ్బంది తో సమన్వయం లేదు దృష్టి అంతా రాబడి పైననే…..తాత్కాలిక ఉద్యోగిపైనే ఆధారం అతని ద్వారానే లావాదేవీలు మొత్తం స్వాహా చేస్తూ ఎంతో కొంత ప్రభుత్వానికి లెక్కలు చేయిస్తున్నారు నిజమైన పేద క్రీడాకారుడు డబ్బులు వెచ్చించి ఈ విధంగా చేయలేని పరిస్థితి… అటు ప్రైవేటుకు వెళ్లలేడు ఇటు ప్రభుత్వం వైపు రాలేడు…. ఇలా అతను ప్రతిభ వెలికి తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేదెలా ప్రారంభంలోనే సూరత్వం ఉంటే అతని ఏ గడప తొక్కలో అర్థం కాని పరిస్థితి ఉంది…..జిల్లా క్రీడా శాఖలో శాశ్వత ఉద్యోగులున్న కూడా స్విమ్మింగ్ పూల్ బాధ్యతలు తాత్కాలిక ఉద్యోగికి ఇవ్వడం దేనిని సూచిస్తుందో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి…..?
ఇంకొక అత్యంత ముఖ్య విషయం ఏంటంటే ఈ అధికారులు తెలివిగా రెండు బిల్ బుక్స్ మెయింటైన్ చేస్తూ తమ రాజ్యాన్ని ఏదేచ్ఛగా ఏలుతున్నారు అనడానికి ఈ ఉదాహరణ….బిల్ బుక్స్ రెండు మెయింటెనెన్స్ జరుగుతున్నవి. దానిలో ఒకటి డమ్మీ బుక్……? లావాదేవీలన్నీ ఈ డమ్మీ బుక్కు ద్వారా ఎంటరై క్రీడాకారులకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది…..?ప్రభుత్వానికి సంబంధించిన బిల్ బుక్ లో ఏదో నామమాత్రంగా ఎంట్రీలు. జరుగుతాయి….?అదేవిధంగా ఇండోర్ స్టేడియం సముదాయంలో గల దుకాణాలలో కిరాయి వసూలు చేసి స్వాహా చేశారని….కార్యాలయ సిబ్బంది చెవులు కోరుకుంటున్నారు….?గతంలో ఒక వ్యాయామ ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత తత్కాలిక డి వై ఎస్ ఓ నర్సీ రెడ్డి పై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి,ఆ సంఘ సభ్యులకు క్రీడా కిట్ లను,ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడని క్రీడాకారులు స్థానికులు తమ అభిప్రాయాన్ని వెలిబుచుతున్నారు….?ఇదొక్కటే కాకుండా ఖేల్ లో ఇండియా హాకీ సెంటర్ నిధులు కూడా గోల్మాల్ జరుగుతున్న పట్టించుకున్న నాధుడే లేడు….? అనుకున్న విధంగా క్రీడాభివృద్ధికి ఖర్చు చేయకపోగా సొంతంగా ఖర్చు చేస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నాడు. నల్గొండ నడిబొడ్డున ఇంత అవినీతి జరుగుచున్న ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు. …? జిల్లా క్రీడల శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు..? అలాగే జిల్లా కలెక్టర్ ఎందుకు మానిటర్ చేయలేకపోతున్నారు అని అంటూ క్రీడాభిమానులు , ప్రజలు ప్రశ్నిస్తున్నారు …….? ఇప్పటికైనా
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించి తగు విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని సీనియర్ క్రీడాకారులు క్రీడాభిమానాలు , ప్రజలు కోరుతున్నారు.
వేచి చూడాలి మరి కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో…. అసలు చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది.