
సీఎం సభకు జనం భారీగా తరలిరావాలి
సీఎం సభకు జనం భారీగా తరలిరావాలి
తుర్కపల్లి, జూన్ 03(ప్రజాకలం ప్రతినిధి)
సీఎం సభకు జనం భారీగా తరలిరావాలని… బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. తుర్కపల్లి మండలం తిరుమలపూర్ గ్రామంలో జూన్ 6వ తేదీన నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాటు పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం జూన్ 6వ తేదీన ముఖ్యమంత్రి సుమారు 1500 కోట్ల తో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాల్లో రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా వెనుకబడిందని, యాదగిరిగుట్ట అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్లు హాజరవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సోనియా గాంధీ అప్పగిస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదాయం గల రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. గంధ మల్ల 1.4 టీఎంసీల కోసం సుమారు 700 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి, మండలంలో ఎస్సీ ఎస్టీలు అధికంగా ఉన్నారని అందుకోసం 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవరానికి, యాదగిరిగుట్టలో 25 కోట్లతో వేద పాఠశాల, కొత్తగా ఏర్పడిన మోటకొండూరు మండలంలో మూడు ప్రభుత్వ భవనాలకు 15 కోట్లతో, కొలనుపాక కాల్వపల్లి బ్రిడ్జిల నిర్మాణానికి 15 కోట్లతో, యాదగిరిగుట్ట ప్రాంతంలో 20 ఎకరాల్లో 170 కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు, 10 కోట్లతో గోదాముల నిర్మాణానికి సుమారు 1500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య మంత్రి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయినాల చైతన్య మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్సిస్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ డొంకెన్ వెంకటేష్,, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రామగొని వెంకటేష్ గౌడ్, నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు