
కలెక్టర్ ను కలిసిన మెట్ పల్లి ఆర్డీవో
కలెక్టర్ ను కలిసిన మెట్ పల్లి ఆర్డీవో
జగిత్యాల ప్రతినిధి మార్చి 02(ప్రజా కలం) :
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెట్ పల్లి డివిజన్ ఆర్డీవోగా నూతన బాధ్యతలు స్వీకరించిన జి. నరసింహరావు సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందజేయగా, కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని,ప్రజలకు పారదర్శకమైన,వేగవంతమైన సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేయాలని, రెవెన్యూ సంబంధిత సమస్యలను సమయానికి పరిష్కరించాలని, జిల్లా అభివృద్ధికి పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.
TAGS Hot News

