
కాంగ్రెస్ నాయకుల చొరవతో ఎస్ ఎన్ డి పి పనులకు మోక్షం
పీర్జాదిగూడ ప్రజలకు తీరనున్న వరద కష్టాలు
మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్
ఎస్ ఎన్ డి పి పనులు పున:ప్రారంభం
ఫలించిన పీర్జాదిగూడ కాంగ్రెస్ నేతల కృషి
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు చర్యలు
పీర్జాదిగూడలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ
ఎన్నికలలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది
పీర్జాదిగూడ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన తుంగతుర్తి రవి
మేడిపల్లి జూన్ 11(ప్రజాకలం న్యూస్)
వర్షాకాలం వచ్చిందంటే వరద నీటితో సహవాసం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల వరద కష్టాలు అతి త్వరలో శాశ్వతంగా తీరనున్నాయి. బోడుప్పల్,పీర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధిలోని వరద నీరు నేరుగా మూసీనదిలో కలిసేందుకు సుమారు 110 కోట్ల రూపాయల నిధులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ ఎన్ డి పి పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పీర్జాదిగూడ ప్రజలకు ఎస్ ఎన్ డి పి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. పీర్జాదిగూడలో ఎస్ ఎన్ డి పి పనులను పునః ప్రారంభించింది.నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే దృడ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎన్నికైన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమం బుదవారం పీర్జాదిగూడ కార్పొరేషన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని,మహిళల కోసం గృహలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ,యువకుల కోసం రాజీవ్ యువ వికాసం,నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు,నిరుపేదల సొంతింటి కలలు సహకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు.ముఖ్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల వరద నీటి కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ ఎన్ డి పి పనులు పూర్తి చేసి శాశ్వతంగా పరిష్కరిస్తుందని,గత ప్రభుత్వం ప్రజల కష్టాలను విస్మరించి ఎస్ ఎన్ డి పి పనులను గాలికి వదిలేసిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీర్జాదిగూడ ప్రజలకు ఇచ్చిన మాట కోసం..ప్రజల సంక్షేమం కోసం.. ఎస్ ఎన్ డి పి పనులు పునః ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఎస్ ఎన్ డి పి పనులు తిరిగి ప్రారంభం అవ్వడానికి కృషి చేసిన టిపిసిసి ఉపాధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్,మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్,మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వరరావు,ఎస్ ఎన్ డి పి ప్రత్యేక అధికారులకు,ఏఈ,డీఈ లకు,ఇతర అధికారులకు,కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లకు,ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులకు, సీనియర్ నాయకులకు,మహిళా నేతలకు,డివిజన్ ఇన్చార్జిలకు,పలు కాలనీల అధ్యక్ష,కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.