
తండ్రి పై కొడుకు కత్తితో దాడి..
..తండ్రికి తీవ్ర గాయాలు..
..ఆసుపత్రికి తరలింపు.
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 09 (ప్రజా కలం) తండ్రి పై కొడుకు దాడి చేసిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..పట్టణంలోని బోయవాడ లో ఆదివారం ఎల్లా గంగా నర్సయ్య పై అతని కొడుకు అన్వేష్ కత్తితో దాడి చేశాడు. దాడిలో నర్సయ్య కు తీవ్ర గాయాలు కాగా అతనిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం కాగా దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TAGS Hot News

