డబ్బులు ఉంటేనే చదువుకో లేకపోతే మానుకో

డబ్బులు ఉంటేనే చదువుకో లేకపోతే మానుకో

డబ్బులు ఉంటేనే చదువుకో లేకపోతే మానుకో
అంగట్లో అంగడి సరుకుగా మారిన విద్యావ్యవస్థ
లక్షల రూపాయలు దండుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
ఒక స్కూలు మాది ఇంటర్నేషనల్ అంటారు
మరొక స్కూలు మరెక్కడా లేని విద్య మేము బోధిస్తామం అంటారు
ఇంత జరుగుతున్న ప్రభుత్వం విద్యాశాఖ పట్టించుకోని వైనం
ప్రభుత్వ పాఠశాలలో నిర్వీర్యం చేయడమే ప్రైవేట్ విద్యాసంస్థల లక్ష్యమా…
రాబోయే రోజుల్లో పేదోడిడు చదువుకు దూరం కావాల్సిందేనా….
ఇకనైనా ప్రభుత్వం విద్యాశాఖ ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టి పేదోడికి నాణ్యమైన విద్య అందించాలి
మహేశ్వరం, (ప్రజా కలం రిపోర్టర్ తడక నర్సింహా )
మరి కొద్ది రోజుల్లో పాఠశాలలు,కాలేజీలు ప్రారంభమవుతున్న తరుణంలో పేదోడి గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో స్కూలు,కాలేజీలో చదివించాలంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ నుండి మొదలు పెడితే కాలేజీ వరకు లక్షల రూపాయలు కట్టనిది చదువు చెప్పే పరిస్థితి లేదు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పరేమో అని ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు ఆశతో కష్టపడి చెమటోచి వచ్చిన డబ్బులు చాలా చాలక అప్పులు చేసి పిల్లలు చదివించాలని కోరికతో ఉంటారు. కానీ మార్కెట్లో ప్రతి చదువుకు ఇంత అని రేటు ఫిక్స్ అయిపోయింది. మార్కెట్లో చదువుని అంగడి సరుకులో కూరగాయల మాదిరిగా అమ్మడం మన వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు తల్లిదండ్రులు వారి ఆశలు అదునుగా చేసుకొని ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తూ పేద ప్రజల నుండి దండుకుంటున్నారు.
పుస్తకాలకు ఇంత స్కూల్ యూనిఫామ్ కి ఇంత అని దండుకోవడమే తప్ప వేరే ఏమీ లేదు చదువు చెప్పడం తక్కువే వసూలు చేయడం ఎక్కువ వారిని అడిగే నాధుడే లేకుండ పోయారు.అటు ప్రభుత్వం కానీ విద్యాసంస్థలు గాని అధికారులు కానీ పట్టించుకోరు. అసలు వారు ఉన్నారా అని అనుమానం కూడా వస్తుంది. రాజకీయ నాయకులు అందరికీ సొంతంగా కాలేజీలో విద్యాసంస్థల ఉంటాయి దీంతో అధికారులు చర్యలు తీసుకునే అవకాశం లేదు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య తో పాటు అనుభవమైన ఉపాధ్యాయులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పరేమో ఒక భావన అందుకు తగ్గట్టు ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకుండా నిర్వీర్యం చేస్తూ రాను రాను ప్రభుత్వ పాఠశాలలు మూత పాట పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వాలు అధికారులు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే పేదోడికి చదువు దూరం కావాల్సిందేనా … అనుమానం కలుగుతుంది అది రాబోయే రోజుల్లో నిజమవుతుందేమో అనిపిస్తుంది. చాలా వరకు మనం గమనిస్తే ప్రైవేటు స్కూల్లో లక్షలు పెట్టి చదివిన విద్యార్థి అయిన ప్రభుత్వ పాఠశాలలో రూపాయి లేకుండా చదివిన విద్యార్థులైన ర్యాంకు ఒకటే వస్తుంది. మరి అది ఎలా సాధ్యం ఒకసారి ఆలోచిస్తే లక్షలు పెట్టిన ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ పాఠశాల బెటర్ చాలావరకు ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు ఐపీఎస్ ఐఏఎస్ కూడా అయ్యారు . ప్రైవేట్ పాటలు చదువుతూ బాగుంటది మన అపోహ మాత్రమే ఉన్నవాడు చదివించాడని లేని వాడు కూడా ప్రైవేట్ పాఠశాల చదివించాలని పోటీపడుతున్నారు. ఈ పోటీలో పడి అప్పులు చేసి ఆగమవుతున్నారు వారి జీవితాలు ఇకనైనా ప్రభుత్వాలు విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థలపై ఆ చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తూ విద్యార్థుల అన్ని సౌకర్యాలు కల్పించి పేదోడికి ప్రభుత్వ పాఠశాలలో దిశా నిర్దేశం చేసే విధంగా అధికారులు ప్రభుత్వ నాయకులు కృషి చేయాలని ప్రతి పేదోడి కోరిక ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదివే విధంగా ప్రోత్సాహకాలు కల్పించాలి ఇకనైనా అధికారులు ప్రవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేస్తారని ఆశిద్దాం.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )