జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు & హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే జారీ చెయ్యాలి

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు & హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే జారీ చెయ్యాలి

– బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 27 (ప్రజా కలం) జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు & హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే జారీ చెయ్యాలనీ బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు . ఆయన శనివారం రోజు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు & హెల్త్ కార్డుల వెంటనే ప్రభుత్వం జారీ చేయాలని  తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న జర్నలిస్టు అక్రిడేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందనీ అన్నారు. ఎలక్షన్ ముందు జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం కాంగ్రెస్ జర్నలిస్ట్ లకు ఎన్నో హామీలు ఇచ్చింది కనీసం ఒక్క హామీ కూడనెరవేర్చలేదు.జర్నలిస్టులకు వెంటనే కొత్త అక్కడేషన్ కార్డు ఇవ్వాలి జర్నలిస్టుల హెల్త్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలతో ఉన్నవి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఒకే ఒక్క అవకాశం అక్రిడేషన్ మాత్రమే అది కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం జర్నలిస్టుల కుటుంబాలకు అందరికీ బస్సు పాస్ లు స్టేట్ పాస్ ఇవ్వాలి వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి హెల్త్ కార్డులో ఉన్న సమస్యలు అన్నీ తీర్చాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శిలు సుంకేటి విజయ్ కుడుకల రఘు బీజేవైఎం నాయకులు గోపనవేని రమేష్ యాదవ్ చెక్కల శ్రీకాంత్ కోసగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )