సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ ప్రయాణం

సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ ప్రయాణం

సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ ప్రయాణం…..
* ఏంఆఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి…
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ……
నల్లగొండ జూన్05 (ప్రజాకలం ప్రతినిధి)
సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతల లేని నూతన సమాజ నిర్మాణం కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎంఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షులు డా: గోవింద్ నరేష్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం టిఎన్జీవో కార్యాలయంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాదిగ సమాజానికి దక్కవలిసిన రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు నిరాదరణకు గురైన వర్గాలైన వికలాంగుల, వృద్దులు వితంతువుల కోసం పోరాడి వారికి పెన్షన్లు సాధించడం జరిగింది.గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ పథకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళ భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, తెల్ల రేషన్ కార్డు ప్రజలకు 6 కిలోల బియ్యం పెంపు మొదలగు ఫలితాలను ఎమ్మార్పీఎస్ సాధించిందని అన్నారు. ఈ ఫలాలు కేవలం మాదిగల కోసం చేసినవి కావని , అన్ని వర్గాల సంక్షేమం సామాజిక బాధ్యతతో చేసిన ఉద్యమలని అని అన్నారు.కాబట్టి సమాజ హితమే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని అన్నారు.మాదిగల కోసం ముప్పై ఏళ్లుగా జరిగిన రాజీలేని పోరాటం విజయవంతమై తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలుజరుగుతుందని అన్నారు. ఈ విజయానికి కారణం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారమే అని అన్నారు .దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు పుట్టినప్పటికీ లక్ష్యం సాధించే వరకు ఏ ఉద్యమం నిలబడలేకపోయాయి కాని ఎమ్మార్పీఎస్ మాత్రమే సజీవంగా నిలబడి లక్ష్యం చేరిందని దానికి సమాజం ఇచ్చిన సహకారమే ప్రధాన కారణమని అన్నారు.కనుక సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ కార్యాచణలో ముందుకు సాగుతామని అన్నారు . ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈ మేరకు MSF జాతీయ కార్యదర్శి డాక్టర్ పల్లర్ల సుధాకర్ మాదిగ, జానకి రామయ్య చౌదరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు మల్లేపాక వెంకన్న మాదిగ, ఎం జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ, కూరుపాటి కమలమ్మ, మేడి శంకర్, కందుల మోహన్, పి హెచ్ పి ఎస్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు పెరిక శ్రీనివాసులు, జీడిమడ్ల రవీందర్, మడుపు శ్రీనివాస్, బొజ్జ చిన్న, బొజ్జ దేవయ్య, మాసరం వెంకన్న, తరి ఏడుకొండలు, మాచర్ల సుదర్శన్, వంగూరి ప్రసాద్, జలంధర్, సైదులు, చింత ఎల్లయ్య, గిరి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )