
మెట్ పల్లి లో చోరీ
మెట్ పల్లి లో చోరీ
మెట్ పల్లి: ప్రతినిధి జూన్ 9 (ప్రజా కలం) పట్టణంలోని బీడీ కాలనీలో ఒక ఇంటిలో చోరీ జరిగినట్లు మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తేదీ 09-06-2025 రోజున మెట్ పల్లి పట్టణం లోని బీడీ కాలనీ కి చెందిన
ఓర్సు అక్షయ్ కుమార్ s/o శివాజీ ,33 yrs, వడ్డెర, r/o బీడీ కాలనీ అను అతడు తేదీ: 06-06-2025 రోజున తేదీ అందాజ సాయంత్రం అందాజ 06:00 గంటలకి తన స్వగ్రామానికి అయిన ఖానాపూర్ కీ వెళ్ళి తిరిగి తేదీ: 09.06.2025 రోజున ఉదయం అందాజ 09:00 గంటలకి మెట్పల్లి లోని తన ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తాళం పగలగొట్టబడి ఉండి తన ఇంటి లోని బీరువా లో నున్న 1 తులం బంగారు గొలుసు, 1/2 తులం బంగారు కమ్మలు, వెండి పట్టా గొలుసులు– 15 తులాల మరియు వెండి మొలతాడు — 06 తులాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు