జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
-దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షు మామిడి సోమయ్య డిమాండ్
జనగామ, జూన్ 04 ( ప్రజా కలం ప్రతినిధి
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా..
జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదని ధ్వజమెత్తారు.ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ,సమస్యల పై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం జనగామలోని పూసల భవన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ…రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టుల
జీవన పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏం ఒరిగిందని, ఏం మేలు చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు జర్నలిస్టుల పేరు చెప్పి అధికార పదవులు పొంది పాలకులకు ఊడిగం చేస్తూ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
అలాంటి జర్నలిస్టు సంఘాల పట్ల యావత్ జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇత ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని, చాలా ఏళ్ళుగా నడుస్తున్న అనేక చిన్న పత్రికలను ప్రభుత్వం గుర్తించకుండా అణచివేస్తున్నదని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న అన్ని చిన్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఇతర సంఘాల నుంచి పెద్దఎత్తున టీడబ్ల్యూజేఎఫ్ లో చేరుతున్నారని చెప్పారు. రాబోయే రెండు మాసాల్లో అన్ని జిల్లా మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, వల్లాల జగన్ మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫెడరేషన్ ను బలోపేతం చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం జర్నలిస్టుల సమస్యలపై నిరంతం పోరాడుతూ, జర్నలిస్టులకు అండగా ఉంటుందని వారన్నారు.
విలేకరులు పాలకుల ముందు తలవంచకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అన్నారు. జనగాం జిల్లా మహాసభలు త్వరలో విజయవంతంగా జరపాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు నీల నరేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు నవీన్ చారి, కృష్ణమూర్తి, కరుణాకర్, పరశురాములు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు నూతనంగా ఫెడరేషన్ సభ్యత్వం తీసుకున్నారు.

సన్నాహక కమిటీ ఏర్పాటు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జనగామ జిల్లా సన్నాహక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో తొమ్మిది మంది సభ్యులున్నారు.నీల నరేష్ బాబు(మెట్రో),గూడూరు లెనిన్(ప్రజాజ్యోతి),చింతకింద కృష్ణమూర్తి (వరంగల్ వాయిస్),బొడ్డు రంజిత్
(జనంసాక్షి),గూడూరు కరుణాకర్ (తెలంగాణ ముచ్చట్లు),కందుల నర్సింగరావు (జనం), వేముల నర్సింగం(జ్యోతి),కుచన సుప్రీం(టీ ఛానెల్), గోవర్ధన్ (దిశ) తదితరులు సన్నాహక కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ ఆధ్యర్యంలో జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి జిల్లా మహాసభ జరపాలని సమావేశం తీర్మానించింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )