ఎమ్మార్పీఎస్ మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఇంచార్జిగా తిప్పారపు లక్ష్మణ్ మాదిగ

ఎమ్మార్పీఎస్ మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఇంచార్జిగా తిప్పారపు లక్ష్మణ్ మాదిగ

ఎమ్మార్పీఎస్ మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఇంచార్జిగా తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, కో-ఇంచార్జిగా మునరాతి అరుణ్ మాదిగలు
మల్కాజిగిరి,జూన్04,(ప్రజా కలం ప్రతినిధి)

జూన్ 05 తేదీ నుండి జూలై 07వ తేదీ వరకు ఎమ్మార్పీఎస్,ఎమ్ ఎస్ పి మరియు అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణంతో పాటు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం పెద్దఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని జిల్లాల ఇంచార్జిలను పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
నియమించడం జరిగిందని మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఇంచార్జులుగా తిప్పారాపు లక్ష్మణ్ మాదిగ నేను నియమించినట్లు లక్ష్మణ్ మాదిగ తెలిపారు.కో- ఇంచార్జిగా మునరాతి అరుణ్ మాదిగ నియమితులయ్యారు.ఈ సందర్బంగా పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు మహాజన సోషలిస్టు పార్టీ, మాదిగ విద్యార్థి సమాఖ్య, మాదిగ మహిళా సమాఖ్య, మాదిగ యువసేన,మాదిగ ఉద్యోగుల సమాఖ్య,మాదిగ కళామండలి,వికలాంగుల హక్కుల పోరాట సమితి,మాదిగ జర్నలిస్టుల ఫోరం,మాదిగ ఆర్టీసీ ఉద్యోగుల సంఘంతో పాటు అనుబంధ సంఘాలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మాణం చేయుట భవిష్యత్తు పోరాటాలకు ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలను దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద పోరాటానికి సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారని లక్ష్మణ్ మాదిగ పేర్కొన్నారు.జాతి కోసం జరిగే పోరాటంలో తను పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వం లో 30 సంవత్సరాల నుండి పని చేస్తున్నాని,వివిధ జిల్లాల ఇంచార్జిలగా పనిచేశాని ఇప్పుడు మేడ్చల్ జిల్లా ఇంచార్జిగా భాద్యతలు అప్పగించినందుకు ధన్యవాదలు తెలుపుతున్నానన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )