
బావిలో దూకి మహిళా ఆత్మహత్య..
బావిలో దూకి మహిళా ఆత్మహత్య..
మల్లాపూర్ నవంబర్ 18 ( ప్రజా కలం ప్రతినిధి)
బావిలో దూకి మహిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెనుకుల రాజా గంగు (55) మధ్యాహ్నం నుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామ శివారులోని బావిలో ఆమె మృతదేహం కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TAGS Hot News

