
పర్యవేక్షణ లోపం .రైతులకు శాపం…?
పర్యవేక్షణ లోపం .రైతులకు శాపం…?
డ్రెనేజీని తలపిస్తోన్న గంగనాల కాలువ
గంగనాల ఆయకట్టు రైతులకు తప్పని సాగునిటితిప్పలు
అయకట్టు క్రింద 4 వేల ఎకరాల కు సాగు నీరు
కాలువ శుభ్రం చేస్తెనే 9 గ్రామల కు సాగునీరు
ఇబ్రహీంపట్నం జూన్ 8( ప్రజా కలం ప్రతినిధి)
నిత్యం జలకళ తో ఉండే గంగనాల కు గడ్డుకాలం తప్పెట్టు లేదు. మెదటీ గలమ చెక్కల గండి ద్వసం అయ్యి నిరు దిగువకు పోయే పరిస్థితి నెలకొంది. పట్టీంచుకోని మరమ్మతులు,కాలువ శుభ్రం చేయ్యకపోతే చేపట్టకపోతే 9 గ్రామలలోని గంగనాల అయకట్టు 4 వేల ఎకరాల సాగు కష్టా కాలమే అయ్యెట్టు ఉంది. కాలువలో పెరిగిన తుంగ,తదితర చెట్లు,మట్టితో కాలువ అధ్వనంగా మారి డ్రెనేజీని తలపిస్తుంది.సంబందిత శాఖ అదికారుల పర్యవేక్షణ లోపం రైతుల పాలిటీ శాపంగా మారిదని అయకట్టు రైతులు వాపోతున్నారు. గోదావరి జలాలతో బీడు భూముల ను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్వం 1959లో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామ శివారులోని గోదావరి నదిపైన సుమారు రెండు మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తుతో అడ్డుగోడ (మత్తడి)ని నిర్మించారు.ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని ఆరుగ్రామాలకు చెందిన దాదాపు 2500 హెక్టార్ల వ్యవసాయభూమికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ నీటిపారుదల పథకానికి రూపకల్పన చేశారు. నిరంతరం నిండుకుండలా తొణికిస లాడుతూ ఆయ కట్టు రైతుల పాలిట కల్పతరువుగా ఉండి ఈ ప్రాజెక్టు ప్రసిద్ధిగాంచింది. అయితే మూడు, నాలుగేండ్లుగా
వర్షపాతం ఎక్కువ గా నీరు వచ్చిన స్టోరెజీ లేక పోవటం తో దిగువకు నిరు పౌయి గోదావరీ నదిలోకీ చేరుతుంది. ఇటీవల భారీ వర్షాలు కురువడం, గోదావరి ఉధృత ప్రవాహంతో వరదనీటి చేరికతో నిండు కుండను తలపించిన ఖరీఫ్ ,రభిలో మంచి పంటలు పండగా రైతులు అనదోత్సవంలో మునిగారు.గంగనాల అయాకట్టు ప్రదాన తుం చక్కలగండి పగుళ్లు తెలి తలుపు లు తుప్పు పట్టాయి. దింతో వేములకుర్తి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్వర్యంలో 17 సంఘం లకు చెందిన సభ్యులు తలపులు వద్ద ఇసక బస్తాలు వేసి పంటలు పండిచు కున్నారు.పలు చోట్ల గ్రామస్తులు మరమ్మతులు చేయించారు. గతంలో రైతులు ఎగువన ఉన్న మైసమ్మ ముల, తునికీ దోరం వద్ద రాతిగోడ, గడ్డీ తో గంగనాల ప్రాజెక్ట్ కు నిరు తెచ్చె పనీలో శ్రమదానం చేశారు. గంగనాలప్రాజెక్ట్ తలుపు తుప్పు పట్టి పైకి లేవలేని స్థితిలో ఉడటం,సంబధిత నిటి పారుదల అధికారులు పర్యవేక్షణ లేక పోవటం ఓ వైపు రైతుల పాలిట శాపం గా మారింది. జగిత్యాల జిల్లా ములరాంపుర్-నిర్మల్ జిల్లా పోన్ కల్ గ్రామ శివారు లో నిర్మించిన సదరు మాటు బ్యారేజీ నిర్మణ కాంట్రాక్టు దారులు గంగనాల మాటుకాలువకు వచ్చే పాయ లో రాల్లు చదును చేయటం తో అయకట్టు క్రింద ఉన్న ఇబ్రహింపట్నం మండలం లోనీ వేములకుర్తి, యామపుర్, ఫకిర్ కోండపుర్,మల్లపుర్ మండలం లోనీ నడికుట,మెగిలిపెట్, ఓబులపుర్,సంగెం శ్రీరాం పుర్,దామరాస్ పెళ్ళి,వాల్గోండ అయకట్టుకు నిరు అందటం కష్టం గా మారీంది రైతులు విడుతల వారిగా గంగనాల కు నిరుతెచ్చె యత్నం చేయక తప్పటం లేదు. కాలువ దాదాపు నాలుగు కిలోమీటర్లు చదును చేస్తె తప్పు ఖరిఫ్ లో దిగువకు నిరు పోయె పరిస్థితి లేదు.సంబదిత శాఖ అధికారులు ,ప్రజాప్రతినిధులు స్పందించి అయకట్టు కాలువ మరమ్మతులు చేసి రైతుల ఇక్టట్లు తిర్చాలని అయకట్టు రైతులు కోరుతున్నారు.
(డ్రెనేజీని తలపిస్తోన్న గంగనాల కాలువ,) (కాలువలో పెరిగిన తుంగ)
కాలువ మరమ్మతులు చేయ్యలి
గుజ్జే గంగాధర్ మాజీ విడిసి చైర్మన్ (వేములకుర్తి)
గంగనాల అయకట్టు క్రింద అదిక సంఖ్య రైతుల పొలాలు ఉన్నాయి. చెక్కల గండి వద్ద తుం ద్వంసమైంది,నిరు వచ్చె కాలువ డ్రెనేజీలా మారి తుంగ,మట్టి తదితర చెట్లతో నిండి గలుమకు నిరు వచ్చే పరిస్థితి లేదు సంబదిత నిటిపారుదల శాఖ అదికారులు వర్షలు రాకముందే మరమ్మతులు చెప్పట్టాలి.
గంగనాల అయకట్టు కు అదికారుల పర్యవేక్షణ కరువైంది
అరె రమేష్ బిజెపి సినియర్ నాయకులు (వేములకుర్తి)
గంగనాల అయకట్టు క్రిందఇబ్రహింపట్నం,మల్లపుర్ మండలాలలో ని 9.గ్రామలకు సాగునిరు పోతుంది కాలువను ఎప్పటికప్పుడు పరిశిదించవలసిన అదికారుల పర్యవేక్షణ లోపంతోనే కాలువ అందకారం గా మారింది. రైతులు ఖరిఫ్ పనులు ప్రారంభించకముందే అదికారులు స్పందించాలి.