
అంతం లేని ‘బడి’ దోపిడీ
అంతం లేని ‘బడి’ దోపిడ
ప్రయివేటులో లక్షల రూపాయల ఫీజు
తడిసి మోపెడవుతున్న రకరకాల రుసుములు
ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా నాయకులు సిద్దు
మహేశ్వరం, జూన్ 17, (ప్రజా కలం )
విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1)సీని
జాతీయంగా 20 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఏపీ, తమిళనాడు. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలలో ప్రయివేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్నారు. ఈ సెక్షన్ను తెలంగాణ, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు మాత్రమే అమలు చేయడం లేదు. 2024 ఆగస్టులో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణ, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుచేయాలని కోరారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది. విద్యా హక్కు చట్టం అమలు చేస్తే స్కూళ్లలో 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాల్సి ఉంటుంది.ప్రయివేట్ బడుల దోపిడీకి రాష్ట్రంలో అంతులేకుండా పోతున్నది. ప్రభుత్వ చట్టాలకు తూట్లు పొడుస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీకి గురి చేస్తున్నా రు. నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులకు వేల నుంచి లక్షలలో ఫీజుల పేరుతో దండుకుం టున్నారు. దీనికి తోడుగా పుస్తకాలు, కరికులం. ఫెయింట్స్, బ్యాగులతో సహా అన్నీ స్కూళ్లలోనే బహిరంగంగా విక్రయాలు చేస్తున్నా, జిల్లా. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నా రు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక
భారం ఆదా చేయాలనుకున్నా, తప్పక కొనాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ప్రాథమిక విద్య పునాది గట్టిగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంద ని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఇందుకోసం ఎల్కేజీ, యూకేజీ, ఒకటో తరగతి స్థాయి నుంచే కార్పొరేట్, ప్రయివేటు స్కూళ్లను కొందరు తల్లి దండ్రులు ఆశ్రయిస్తున్నారు. ఎంత ఖర్చు పెడితే అంత ఎక్కువ చదువు వస్తుందని భావించే తల్లి తండ్రులు సైతం ఉన్నారు. పిల్లల చదువులపై తల్లిదండ్రులు అనేక ఆశలు పెంచుకుంటూఖర్చు పెడుతున్నారు. తగిన ఆదాయం లేనివారు సైతం ప్రయివేటు బడిలో చేర్పిస్తున్నారు. తాము పడిన కష్టాలు పిల్లలు పడొద్దని ప్రేమతోనూ మరికొందరు ప్రయివేటు స్కూల్ బాట పడుతుండటం గమనార్హం.వేల రూపాయల పుస్తకాలునూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునః ప్రా రంభమయ్యాయి. విద్యార్థులకు పుస్తకాలు, రాతపుస్తకా లు, బ్యాగులు, యూనిఫామ్, ఇతరత్రా విద్యా సామగ్రి అవసరం. ప్రయివేటు విద్యార్థులకైతే ఇవన్నీ తప్పక కొనుక్కోవాల్సిన పరిస్థితి. కొనుగోలు చేయాలంటే విద్యా ర్థుల తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితికి వెనుకాముందు ఆలోచించాల్సిందే. పెరిగిన ధరలతో విద్యార్థులకు పాఠ శాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయాలంటే రూ. వేలలలో ఖర్చు చేయాల్సిందే. జూన్ నెలలో పేద,మధ్య తరగతి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రయివేటులోనూ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే వినియోగిస్తున్నారు. వీటితో 6 నుంచి 8 తరగతి వరకు ఐఐటీ ఫౌండేషన్ వంటి స్పెషల్ బుక్స్ కొనాల్సి వస్తోంది. 9, 10వ తరగతులకు పాఠ్యపు స్తకాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీంతో ఉన్నత తరగ తుల విద్యార్థులకు కొంత భారం తగ్గుతోంది. సాధారణ ఖర్చులకు అదనంగా డిజటల్, ఆన్లైన్ తరగతులకు అంతర్జాలం ప్రాజెక్టు పనులకు ఇతర వస్తువులు, తర్వాత నెలలలో వార్షికోత్సవం, జాతీయ, సంప్రదాయ పండుగల సందర్భంగా వేషధారణలకు, పరీక్ష రుసుములు, వ్యాన్, బస్సులకు ఇలా వెచ్చించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పాఠశాల ఫీజులు సైతం తడిసి మోపెడవుతున్నాయి. నర్సరీకే రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు పెడు తుండటం గమనార్హం.20 రాష్ట్రాలలో విద్యాహక్కు చట్టం విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1)సీని జాతీయం ష్ట్రాలు అమలుచేస్తున్నాయి. ఏపీ, తమిళనాడు.. అనేక రాష్ట్రాలలో ప్రయివేట్ స్కూళ్లలో 25 శాతా పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్నాయి న్ను తెలంగాణ, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగా రాష్ట్రాలు మాత్రమే అమలు చేయడం లేదు. 202 లో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజ్యసభలో మా తెలంగాణ, పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ ఈ పథకాన్ని అమలుచేయాలని కోరారు. అంద ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది. విదా చట్టం అమలు చేస్తే స్కూళ్లలో 25 శాతం పేద కు ఉచితంగా విద్య అందించాల్సి వస్తోంది. అయి గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రజా పాలన సైతం అమలు చేయకపోవడం ఆశ్వర్యం కలిగిస్తుందని అన్నారు.