
గణేష్ నిమజ్జన ఊరేగింపు శాంతియుతంగా జరుపుకోవాలి
– మెట్ పల్లి సీఐ వి అనిల్ కుమార్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 04 (ప్రజా కలం) గణేష్ నిమజ్జన ఊరేగింపును శాంతియుతంగా జరుపుకోవాలని మెట్ పల్లి సి ఐ వి.అనిల్ కుమార్ అన్నారు.
గురువారం రోజు పట్టణంలోని ముఖ్యమైన గణేష్ మండపాల నిర్వాహకులను మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కు పిలిపించి, గణేష్ నిమజ్జన ఊరేగింపును శాంతియుతంగా పూర్తి చేయాలని అన్ని మండపాల నిర్వాహకులను మరియు యువ సభ్యులను హెచ్చరించారు మరియు కౌన్సెలింగ్ ఇచ్చారు.
TAGS Hot News

