ప్రభుత్వ స్థలాల్లో దర్జాగా ఇళ్ల నిర్మాణం

ప్రభుత్వ స్థలాల్లో దర్జాగా ఇళ్ల నిర్మాణం

ప్రభుత్వ స్థలాల్లో దర్జాగా ఇళ్ల నిర్మాణం….
కబ్జాదారులు 307లో విర్రవీగుతున్న కబ్జాల బాగోతం.
పట్టించుకోని రెవెన్యూ అధికారులు


ప్రజాకలం/ కుత్బుల్లాపూర్ (ప్రతినిధి)
“గాజులరామారం సర్వే నెం. 307 – ప్రభుత్వ భూములు… బంపర్ డ్రీమ్ విల్లాలుగా విక్రయిస్తున్నారు. పక్కనే ఉన్న విల్లాలు వేరే వాళ్లవి…అవి చూపించి “ఇదిగో అన్నా, ఇదే రేంజ్ లో నీ ఇల్లు కూడా అవుతుంది!” అని దిక్కులు మరిగేలా ప్రచారం చేస్తున్నారు! అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ భూములు కబ్జా చేసి, 60 గజాల్లో చిన్న రూమ్ వేసి,”ఇపుడు ఇది తీసుకోండి… 15 లక్షలు ఇవ్వండి… రేపటి ప్రభుత్వంలో మేమే పట్టా ఇప్పిస్తాం! అప్పుడు మీరు కూడా విల్లా కట్టుకోండి!” అని కలల లోకంలో తిప్పేస్తున్నారు.రాజు & రాజేంద్ర అనే ఈ కబ్జాదారులు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూములు విక్రయిస్తున్నారు వీరిపైన చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కూకట్పల్లికి కుత్బుల్లాపూర్ కి దగ్గర్లో ఉన్న 307 సర్వే నెంబర్లు అక్రమ నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి. గతంలో కలెక్టర్ వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి కబ్జాలపై ఆరా తీశారు అప్పుడు కొన్ని రోజులు కబ్జాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు పేదలను మభ్యపెట్టి ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. పేద ప్రజల చెమట చుక్కలతో దాచుకున్న డబ్బులను కబ్జారాయులు సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద కాంగ్రెస్ నాయకుల దీవెనతో
ఈ డ్రీమ్ విల్లా మాయాజాలాన్ని నడుపుతున్నారు! మీకో చిన్న గది చూపించి,”రేపు మీకు విల్లా వస్తుంది, పట్టా వస్తుంది!” అని వారే కబ్జా చేసిన భూమిని మళ్లీ మీకు అమ్ముతున్నారు. అదీ ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తామని చెబుతూ! మాయ మాటలు చెబుతున్నారు.

పబ్లిక్ కి హెచ్చరిక –
ఇది ఒక్కడో ఇద్దరో చేసే మోసం కాదు…ఇది కబ్జా – ప్యాకేజీ – రాజకీయ రూట్ లో జరుగుతున్న డ్రామా! అని స్థానికులు ఆరోపించారు.పొలాన్ని పంచనెంగా అమ్మేస్తున్న కాలం ఇది – పద్ధతిగా జాగ్రత్త పడండి!”ఈ మోసాన్ని పంచండి. ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వ భూములు పబ్లిక్ ప్రాపర్టీ – ఒక్కరికి కాదు, అందరికి ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ తతంగమంతా కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరుగుతుంది. రెవెన్యూ అధికారులు కబ్జా చేసిన పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోయారు. కబ్జాదారులకు గతంలో ఇక్కడ తహసీల్దారుగా విధులు నిర్వహించిన గౌతమ్ కుమార్ లాంటి రెవెన్యూ అధికారి కావాలని స్థానికులు కోరుతున్నారు. దాదాపు నెలలు గడుస్తున్న రెవెన్యూ అధికారి లేకపోవడం గర్వనీయమని మేధావులు అంటున్నారు. ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్ముతున్న వారిపై ఎటువంటి కేసులు లేవు అదే సామాన్యుడు చిన్న రూము వేసుకుంటే గద్దర్ లాగా వాలే రెవెన్యూ అధికారులు కనిపించడం లేదని స్థానికులు ఆరోపించారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రభుత్వం పట్టించుకోని పేద ప్రజలకు ఇల్లు లేని వారికి ఇవ్వాలని కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )