విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.

– గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ స్విచ్ ను స్టార్ట్ చేయడం తోనే ప్రమాదం జరిగిందా..?
మల్లాపూర్ జూన్ 14 ( ప్రజా కలం ప్రతినిధి)
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామం లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామానికి చెందిన దుంపేట రాజేశం గత రెండు సంవత్సరాల నుండి జెఎల్ఏం గా వాల్గొండ లో విధులు నిర్వహిస్తున్నాడు.విద్యుత్ మరమ్మత్తుల దృశ్య విద్యుత్ స్తంభం వద్ద ఉన్న కంట్రోల్ స్విచ్ ను ఆఫ్ చేసి మరమ్మత్తులు చేస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ స్విచ్ ను స్టార్ట్ చేయడం వల్ల నే కరెంట్ షాక్ తగిలి స్తంభం మిది నుంచి కింద పడి రాజేశం అక్కడిక్కడే మృతి చెందాడు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.రాజేశం కు కూతురు, కొడుకు ఉన్నారు.పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )