క్లబ్ ఆస్తి విక్రయ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, జూలై 28 (ప్రజాకలం) : మెట్ పల్లి క్లబ్ ఆస్తి విక్రయ ఘటనలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు నమోదు చేసినట్లు మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. క్లబ్ ఆస్తిని ఎవరికీ తెలియకుండా క్లబ్ భూములను విక్రయించి ప్రజలను మోసం చేసినారన్న మెట్ పల్లికి చెందిన దొంతుల వెంకటేశ్వర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు వ్యక్తులు చెట్లపల్లి నరేందర్ గౌడ్, గంగుల వివేక్, వేముల కిషన్, దొంతుల సుధాకర్, వేముగంటి భూమేశ్వర్, నీల రాజు, వేముల అశోక్ అను వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )